ఆమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్ట్‌ బాధితులు ధోనిపై వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. అమ్రపాలి గ్రూప్ ధోనీకి ఎండోర్స్మెంట్ ఫీజు కింద చెల్లించిన రూ.42 కోట్లను తిరిగి రికవరీ చేయాలని కోర్టును ఆశ్రంయించే అంచనాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు జూలై 23 న ఆమ్రపాలి గ్రూప్ ఇంటి కొనుగోలుదారులకు సంబంధించిన రూ.42.22 కోట్లను ధోనికి చెల్లించిందని తెలిపింది. ఈ డబ్బును ధోని ఎండోర్స్‌మెంట్ వ్యవహారాలు చూసుకునే రితి స్పోర్ట్స్‌ సంస్థకు చెల్లించారని తెలిపింది. ధోనీ అప్పట్లో ఆమ్రపాలి గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్న విషయం అందరికి తెలిసిందే.

 

అయితే అప్పుడు సుప్రీం కోర్టు ఆమ్రపాలి డైరెక్టర్లు, అధికారులు సహా గ్రూప్‌కు చెందిన అనుబంధ కంపెనీలను దారిమళ్లించిన డబ్బును కోర్టులో డిపాజిట్ చేయాలని తెలిపింది. ఇందులో  ధోనీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇంటి కొనుగోలుదారుల అడ్వకేట్ ఎంఎల్ లహోతీ శుక్రవారం మాట్లాడుతూ సుప్రీం కోర్టు నుంచి ధోనీ డబ్బు డిపాజిట్ చేయాలనే తీర్పును ప్రకటించాలని తెలిపారు. జూలై 23 నాటి జడ్జిమెంట్‌ను అతిక్రమించి కోర్టు ఆమ్రపాలి గ్రూప్ డబ్బులను రితి స్పోర్ట్స్ కంపెనీకి కూడా దారిమళ్లించిందనే అంశాన్ని పేర్కొందని గుర్తు చేశారు.

 

డిసెంబర్ 16 న ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు నుంచి ఒక నిర్ణయం రానుంది. శుక్రవారం రోజునే ధోని రూ.42 కోట్ల రికవరీ అంశానికి సంబంధించి వాదనలు జరగాల్సి ఉండగా  అయితే కోర్టు ఈ అంశాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. ఆమ్రపాలి గ్రూప్ వేలాది మంది ఇంటి కొనుగోలుదారులను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందే. వారి డబ్బును సొంత, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంది. ఆమ్రపాలి గ్రూప్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల వ్యయం రూ.8,500 కోట్లకు పైగా  ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇందులో ఇంటి కొనుగోలుదారులు చెల్లించాల్సిన మొత్తం రూ.3,700 కోట్లు కాగా మిగతా డబ్బును కంపెనీ నుంచి రకవరీ చేయాల్సి ఉంది. ఎన్‌బీసీసీ ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.200 కోట్లు రికవరీ చేశారు.

 

వేలాది మంది గృహ కొనుగోలుదారుల డబ్బులను చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించినందుకు ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయం విధితమే. డబ్బు దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్‌ మేనేజ్మెంట్‌‌, ఆమ్రపాలి మహి డెవలపర్స్‌ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుందని కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. ఇకపోతే ఆమ్రపాలి గ్రూప్‌ నకు ధోనీ 2009 నుంచి 2015 వరకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: