ఇటీవల బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ కు ఎంపికై  అంతర్జాతీయ క్రికెట్ లోకి  అడుగుపెట్టాడు టీమిండియా హిట్టర్  శివమ్ దూబే.  అయితే  ఆ సిరీస్ లో పెద్దగా రాణించకున్న తరువాత అతను వెస్టిండీస్ తో  టీ 20, వన్డే సిరీస్ లకు సెలక్ట్ అయ్యాడు. అందులో భాగంగా  విండీస్ తో టీ 20 సిరీస్ లో  దూబే అదరగొట్టాడు.  బ్యాట్ తోనే కాదు   బంతి తోనూ పార్ట్ టైం బౌలర్ గా జట్టుకు ఉపయోగపడ్డాడు.  ఇప్పుడు ఈ అడ్వాంటేజే  దూబే కు వరసగా  అవకాశాలను తెచ్చిపెడుతుంది. 
 
ఇక కెరీర్ లో  మొదటి సారి వన్డే సిరీస్ కు ఎంపికైన దూబే తొలి మ్యాచ్ లోనే  తుది జట్టులో స్థానం  సంపాదించాడు. గత కొంత కాలం గా  టీమిండియా కు సెలక్ట్ అవుతున్న  కూడా  జట్టులో చోటు దక్కించుకోలేక బెంచ్ కే పరిమితం అవుతున్నాడు  మనీష్ పాండే.  కానీ  దూబే మాత్రం అలా వచ్చి  ఇలా తుది  జట్టులో స్థానం సంపాదించి ఏకంగా  పర్మినెంట్ గా  సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఈరోజు చెన్నై లో  వెస్టిండీస్ -భారత్ ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ తో  దూబే అంతర్జాతీయ వన్డే ల్లోకి  ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈమ్యాచ్ లో  దూబే  ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: