ఐపీఎల్  2020 సీజన్ కోసం  ఈరోజు కోల్ కత్తా లో ఐపీఎల్  వేలం  జరుగనుంది. ఎనిమిది  జట్లలో మొత్తం  73 బెర్తుల కోసం ఈ వేలంను  నిర్వహించనున్నారు.  మొత్తం  332 మంది  ఆటగాళ్లు ఈ వేలంలో  అందుబాటులో ఉండనున్నారు.  ఇందులో 186 మంది భారత ప్లేయర్లు ఉండగా మిగితా వారు విదేశీ ప్లేయర్లు వున్నారు. ఎనిమిది జట్లలో  29 బెర్తుల కోసం  విదేశీ ఆటగాళ్లు  పోటీపడనున్నారు. 
 
 
ఎక్కువగా  ఆస్ట్రేలియా నుండి 35మంది ఈ వేలంలో  అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో  పాట్ కమ్మిన్స్ , గ్లేన్ మాక్స్ వెల్ , క్రిస్ లిన్ హాట్ ఫేవరేట్ లుగా బరిలోకి దిగుతున్నారు.  ఇక  దక్షిణాఫ్రికా -23 ,ఇంగ్లాండ్ - 22,వెస్టిండీస్ -19, న్యూజిలాండ్ -18,శ్రీలంక- 14,ఆఫ్ఘానిస్తాన్ -7, బంగ్లాదేశ్-5,అమెరికా -1,యూఏఈ-1,స్కాట్లాండ్ - 1 దేశాల  ఆటగాళ్లు ఈవేలానికి అందుబాటులో ఉండనున్నారు.  మధ్యాహ్నం  2:30 గంటల నుండి ఈ వేలం ప్రక్రియ  స్టార్ట్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: