ఐపీఎల్
2020 సీజన్ కోసం ఈరోజు కోల్ కత్తా లో ఐపీఎల్ వేలం జరుగనుంది. ఎనిమిది జట్లలో మొత్తం 73 బెర్తుల కోసం ఈ వేలంను నిర్వహించనున్నారు. మొత్తం 332 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. ఇందులో 186 మంది భారత ప్లేయర్లు ఉండగా మిగితా వారు విదేశీ ప్లేయర్లు వున్నారు. ఎనిమిది జట్లలో 29 బెర్తుల కోసం విదేశీ ఆటగాళ్లు పోటీపడనున్నారు.
ఎక్కువగా
ఆస్ట్రేలియా నుండి 35మంది ఈ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పాట్ కమ్మిన్స్ , గ్లేన్ మాక్స్ వెల్ , క్రిస్ లిన్ హాట్ ఫేవరేట్ లుగా బరిలోకి దిగుతున్నారు. ఇక దక్షిణాఫ్రికా -23 ,ఇంగ్లాండ్ - 22,వెస్టిండీస్ -19,
న్యూజిలాండ్ -18,శ్రీలంక- 14,ఆఫ్ఘానిస్తాన్ -7, బంగ్లాదేశ్-5,అమెరికా -1,యూఏఈ-1,స్కాట్లాండ్ - 1 దేశాల ఆటగాళ్లు ఈవేలానికి అందుబాటులో ఉండనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుండి ఈ వేలం ప్రక్రియ స్టార్ట్ కానుంది.