మరొకసారి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ టాప్ రికార్డులో నిలిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో షమీ అత్యధిక వన్డే వికెట్లు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఎలాగైతే మొదలు పెట్టాడో అదే విధంగా ఈ ఏడాదిని అత్యధిక వన్డే వికెట్లతో ముగించాడు. చివరి వన్డేలో వెస్టిండీస్తో షమీ వికెట్ సాధించాడు.
2019లో21 మ్యాచ్లు షమీ ఆడి ఆ మ్యాచ్ లో 42 వికెట్లు షమీ సాధించాడు. ఫలితంగా ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డును లిఖించుకున్నాడు. ఈ ఏడాది షమీ ఐదు వికెట్లను ఒకసారి సాధించగా, ఒక హ్యాట్రిక్ను కూడా ఆయన సొంతం చేసుకున్నాడు.అఫ్గానిస్తాన్తో వరల్డ్కప్లో జరిగిన మ్యాచ్లో షమీ హ్యాట్రిక్ సాధించాడు.
షమీ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, ఫెర్య్గుసన్లు ఉన్నారు. 38 వికెట్లను ట్రెంట్ బౌల్ట్, 35 వికెట్లను ఫెర్గ్యుసన్ సాధించి వీరిద్దరూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో షమీ తర్వాత ఉన్నారు. ఈ ఏడాది భారత్కు విండీస్ మ్యాచే చివరిది కాగా, కివీస్కు సైతం వన్డే మ్యాచ్లు లేవు. దాంతో షమీనే టాపర్గా ఉంటాడు. కాగా, నిజానికి షమీ ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే వికెట్లు సాధించడం ఇది రెండోసారి.
గతంలో 2104లో తొలిసారి అత్యధిక వన్డే వికెట్లతో టాప్ స్థానంలో షమీ నిలవగా, ఆ తర్వాత మరొకసారి ఆ ఫీట్ సాధించాడు. ఇక మిగిలిన ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్(33), కుల్దీప్ యాదవ్(32)లు ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. యజ్వేంద్ర చహల్(29) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ నాల్గో బౌలర్. అంతకుముందు కపిల్దేవ్(32 వికెట్లు-1986లో), అజిత్ అగార్కర్ 58 వికెట్లు-1998లో), ఇర్ఫాన్ పఠాన్((47 వికెట్లు-2004లో)లు ఉన్నారు.