తాజాగా వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే కదా. విండీస్ చేసిన 316 పరుగుల టార్గెట్ను విరాట్ గ్యాంగ్ 48.4 ఓవర్లలో ఆరు వికెట్లతో ఛేదించి విజయం సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) లు చేసి అర్ధ సెంచరీలు చేయగా, కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) ఆడి ఇన్నింగ్స్ ముందుకు కొనసాగించడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా చివర్లో ఫాస్ట్ బౌలర్ ఐనా శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్గా నిలవడం జరిగింది.
చివరిలో భారత్ మ్యాచ్ను కోల్పోతుందా అనే వేళలో ఠాకూర్ క్రీజ్లోకి రావడంతో మ్యాచ్ను ఏకపక్షంగా చేయడం వల్ల ఇన్నింగ్స్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక కాట్రెల్ వేసిన 48 ఓవర్ మూడో బంతిని సిక్స్ కొట్టి శార్దూల్.. ఆ ఓవర్ నాల్గో బంతిని ఫోర్ కూడా తీయడం జరిగింది. 6 బంతులలో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 17 పరుగులు సాధించడంతో భారత్ ఇంకా 8 బంతులు ఉండగానే విజయాన్ని సొంతం చేయడం జరిగింది. మ్యాచ్ అనంతరం జడేజా-శార్దూల్ ఠాకూర్లు గ్రౌండ్లో కలిసి వీరిని ఇద్దరినీ కోహ్లి అభినందించడం జరిగింది. మొదటగా ఠాకూర్ను భుజంపై చేతితో తడుతూ అతని ఆటను మెచ్చుకోవడం జరిగింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత తన ట్వీటర్ అకౌంట్లో సైతం శార్దూల్ను కోహ్లి తెలియచేయడం జరిగింది. ఇలా శార్దూల్ను కోహ్లి ప్రశంసించడంపై ట్వీటర్లో అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా జరగడం అద్భుత ఇన్నింగ్స్ అంటూ శార్దూల్ ఆటను అభినందించడం జరిగింది. . తన చివరి శ్వాస వరకూ ఠాకూర్కు తానే ఫ్యాన్గా ఉంటానని ఒక అభిమాని ట్వీట్ చేశాడు.