బీసీసీఐ పాకిస్తాన్‌  క్రికెట్‌  బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణికి తాజాగా ఒక   స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇచ్చింది ఇంతకీ అస్సలు విషయం ఏమిటంటే  భారత్‌ దేశంలో కంటే తమ దేశంలో సెక్యూరిటీ బాగుందంటూ అక్కసును పాకిస్తాన్‌  క్రికెట్‌  బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ప్రదర్శించిన విషయం తెలిసిందే దీనిపై  బీసీసీఐ  అతనికి స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇచ్చింది.  బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ మహీమ్‌ వర్మ తమ దేశంలో సంగతి తాము చూసుకుంటామని, మీ దేశంలో సెక్యూరిటీపై దృష్టి పెడితే సమంజసంగా ఉంటుందంటూ  స్పష్టం చేశారు. 

 

అసలు భారత్‌లో సంగతి పీసీబీకి ఎందుకంటూ ఆయన మండిపడ్డారు. ‘ ముందు మీరు చేయాల్సింది.. మీ దేశంలో రక్షణ గురించి. తొలుత దానిపై ఫోకస్‌ చేయండి. అంతేకానీ భారత్‌లో సెక్యూరిటీని ఉదహరిస్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం  మీకు  లేదు. మా సెక్యూరిటీ గురించి మేము చూసుకుంటాం. మా దేశంలో పటిష్టమైన సెక్యూరిటీతో మ్యాచ్‌లు నిర్వహించుకునే సత్తా మాకు ఉంది. దానికి  తగినంత బలం మాకు  ఉంది.  మీ పని మీరు చూసుకుంటే మంచిదిమాపై వ్యాఖ్యలు ఆపి ’ అని మహీమ్‌ వర్మ  పాకిస్తాన్‌  క్రికెట్‌  బోర్డు చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి స్పష్టం చేశారు.

 

స్వదేశంలో  శ్రీలంకతో దశాబ్దం తర్వాత జరిగిన తొలి టెస్టు సిరీస్‌ విజయవంతం కావడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అమితానందంగా ఉంది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. పాకిస్తాన్‌ భద్రతా పరంగా భారత్‌ కంటే ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 ‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్‌ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే పాకిస్తాన్  రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం అని చెప్పారు . ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్‌ కంటే పాక్‌ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడటానికి లేని భయం పాక్‌ రావడానికి ఎందుకు?’ అని వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: