టెస్టుల్లో టీమిండియా సారథి
కింగ్ కోహ్లీ నెంబర్ 1 ర్యాంక్ కు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ నుండి ముప్పు పొంచి వున్న సంగతి తెలిసిందే. నిషేధం తరువాత యాషెస్ సిరీస్ ద్వారా ఇటీవల మళ్ళీ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్ ఆ సిరీస్ లో ఏకంగా 4టెస్టుల్లో 774రన్స్ చేసి
కోహ్లీ నుండి నెంబర్ వన్ ర్యాంక్ ను లాగేసుకున్నాడు. అయితే ఆతరువాత సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్ లో రాణించి కోహ్లీ మళ్ళీ తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇటీవల ఆసీస్ ఎక్కువగా టెస్టు సిరీస్ లు ఆడుతుండడంతో కోహ్లీ నుండి నెంబర్ 1 ర్యాంక్ దూరమవుతుందోనని అభిమానులు కంగారు పడ్డారు కానీ పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ నుండి స్మిత్ ఫామ్ కోల్పోవడంతో
కోహ్లీ అగ్ర స్థానం పదిలంగా వుంది.
ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో 928పాయింట్ల తో కోహ్లీ అగ్ర స్థానంలో కొనసాగుతుండగా 911పాయింట్ల తో స్మిత్ రెండో స్థానం లో వున్నాడు. అలాగే వన్డే ర్యాకింగ్స్ లో కూడా కోహ్లీ అగ్ర స్థానం లో కొనసాగుతుండగా టీ 20 ల్లో మాత్రం 10 వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.