అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. ఆయన అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇర్ఫాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి క్రికెట్ దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం అతను అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు తన తరపున ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్కు వీడ్కోలు పలికినా అభిమానులు తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇర్ఫాన్ 1984లో గుజరాత్లోని వడోదరలో జన్మించి 2003లో జాతీయ జట్టులో ఇర్ఫాన్ చోటు సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాతో అదే ఏడాది డిసెంబరులో జరిగిన టెస్టు మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే వన్డేల్లోనూ ప్రవేశించి సత్తా చాటాడు. ఇక మొత్తం 120 వన్డేలు ఇర్ఫాన్ పఠాన్ భారత్ తరఫున , 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు తీశాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు.ఇర్ఫాన్ అదే విధంగా 282 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక బౌలింగ్ శైలితో టీమిండియా మాజీ సారథి, దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ అభిమానులు ఇర్ఫాన్ను పోలుస్తారన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో ఇర్ఫాన్ కీలక పాత్ర పోషించి లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన .. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో చివరిసారిగా(2012) మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం అతడు జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు మెంటార్ కమ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్తో పాటు ఇర్ఫాన్ పఠాన్కు సినీ రంగంలోనూ ప్రవేశం ఉంది. ఝలక్ ధిక్లాజా డ్యాన్స్ రియాలిటీ షోలో 2015లో పాల్గొన్న ఈ బౌలర్... చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.