విరాట్ కోహ్లీ ప్రపంచంలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు.  టీం ఇండియా ప్రాంచంలోనే నెంబర్ 1 గా నిలిచింది అంటే దానికి ప్రధాన కారణం కోహ్లీ అని చెప్పాలి.  ధోని అందించిన విజయాలను కోహ్లీ కొనసాగిస్తున్నారు.  అన్ని ఫార్మాట్లలో ఇండియా దూసుకుపోతున్నది.  దేశీయంగా, విదేశాల్లో ఎక్కడైనా సరే సై అంటూ దూసుకుపోతున్నది.  వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లలో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  


వెస్ట్ ఇండీస్ తో టీం ఇండియా టి 20, వన్డే, టెస్ట్ మ్యాచ్ లు ఆడింది.  ఈ మ్యాచ్ లలో ఇండియా విజయం సాధించింది.  అయితే, ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్ లకు సిద్ధం అయ్యింది.  ఇటీవలే శ్రీలంక ఇండియా టూర్ కు వచ్చింది.  మొదటి టి 20 మ్యాచ్ గౌహతిలో జరగాలి.  ఆదివారం రాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.  


మ్యాచ్ జరగడానికి ముందే వర్షం ఆగింది.  పిచ్ పై కప్పిన పట్టలు తొలగించారు.  అయితే, నీళ్లు లీక్ పిచ్ తడిసింది.  సిబ్బంది పిచ్ ను శుభ్రం చేశారు. అంతా రెడీ అయ్యింది.  పిచ్ ను పరిశీలించిన అంపైర్లు అవుట్ ఫీల్డ్ పై సంతృప్తి వ్యక్తం చేసినా, పిచ్ తడిగా ఉండటంతో అంపైర్లు అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు.  అనంతరం విరాట్ కోహ్లీ క్యూరేటర్ తో కలిసి పిచ్ ను పరిశీలించారు.  పిచ్ పై బొటనవేలు పెట్టి ఒత్తి చూశాడు.  పిచ్ తడిగా ఉందని, ఈ సమయంలో మ్యాచ్ ఆడితే ఆటగాళ్లకు గాయాలు అవుతాయని అన్నారు.  దీంతో మ్యాచ్ రద్దయ్యింది.

 
వర్షం కారణంగా మ్యాచ్ రద్దుకావడంతో ఇద్దరికీ చేరిక పాయింట్ వచ్చింది.  ఇంకా రెండు టి 20లు ఉన్నాయి.  రెండు మ్యాచ్ లు ఇండియా తప్పనిసరిగా గెలవాలి.  ఇక ఇదిలా ఉంటె, విరాట్ కోహ్లీని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.  పిచ్ పై కూర్చొని ముగ్గులు వేస్తున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.  కొంతమంది ఫీల్డ్ పై కూర్చొని పరిశీలిస్తుంటే.. ఆ పక్కన అనుష్క కూర్చొని ఉంటుంది.  మ్యాచ్ రద్దుకావడంతో అభిమానులు ఏం చేయాలో తెలియక ఇలా ట్రోల్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: