మొన్న ఆదివారం శ్రీలంక-ఇండియా టీ 20 తోలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోగా నేడు రెండో టీ20లో శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ చాలా ఈజీగా చేధించింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనవిజయం సొంతం చేసుకుంది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 

 

భారత బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ 45, ధావన్ 32, అయ్యర్ 34, కోహ్లీ 30 పరుగులు చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో పెరేరా 34, ఫెర్నాండో 22 పరుగులు చేశారు. 20 ఓవర్లు ఆడిన శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, నవ్‌దీప్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా... బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. దీనికి ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: