టీం ఇండియా ఓపెనర్‌గా గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ రాణిస్తున్నా సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత సంవత్సరంలో అతను వన్డేల్లో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు.. టీ-20ల్లో మూడు అర్థశతకాలు చేసి క్రికెట్ అభిమానులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

 

అయితే టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌కి గాయం కావడంతో జట్టులోకి వచ్చిన రాహుల్ నిలకడైన ఫామ్‌తో టీం విజయాల్లో కీలక పాత్ర వహించాడు. ఇండోర్ వేదికగా నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ-20లో మరో అర్థ శతకానికి చేరువలో అతను ఔట్ అయ్యి అభిమానులకు బాధను కల్గించాడు. 

 

ఈ నేపథ్యంలోనే నిన్న రెండో టీ-20 అయినా అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఈ మధ్యకాలంలోనే నేర్చుకున్నానని అయన తెలిపాడు. ''గతంతో పోలిస్తే.. ఈ మధ్యకాలంలో మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం కానీ, పరుగులు ఎలా సాధించాలో తెలిసింది. ఇంతకాలం నాకు అది తెలిసేది కాదు. మిడిల్‌లో బ్యాటింగ్ చేసేప్పుడు మ్యాచ్‌కి అవసరమైన పరుగులు చేశాను.. ఇప్పుడు దాన్నే కొనసాగిచడం చాలా సంతోషంగా ఉంది'' అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. దీంతో అతని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: