మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఈరోజు
పూణే లో భారత్ ,
శ్రీలంక మధ్య చివరి మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి
శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఎట్టకేలకు ఈమ్యాచ్ ద్వారా
కేరళ వికెట్ కీపర్
సంజు శాంసన్ కు అవకాశం లభించింది. రెగ్యులర్ వికెట్ కీపర్
రిషబ్ పంత్ కు విశ్రాంతినివ్వడంతో సంజు జట్టులోకి వచ్చాడు. పంత్ తోపాటు శివమ్ దూబే ,
కుల్దీప్ యాదవ్ లను కూడా పక్కకు పెట్టడంతో వారి స్థానాల్లో
మనీష్ పాండే , యుజ్వేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చారు. మరో వైపు
శ్రీలంక కూడా జట్టులో మార్పులు చేసింది. ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తోపాటు లక్షణ్ సందకన్ లను తుది జట్టులో కి తీసుకుంది.
భారత జట్టు :
రాహుల్ , ధావన్ , కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , సంజు శాంసన్, మనీష్ పాండే , సుందర్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శ్రద్ధుల్ ఠాకూర్
లసిత్ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసున్ శనక, కుశాల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, లక్షణ్ సందకన్