శుక్రవారం పూణే వేదికగా శ్రీలంక తో జరిగిన  మూడో టీ 20లో గెలిచి  2-0తో  టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక అనంతరం  ట్రోఫీ తో భారత జట్టు  స్క్వాడ్  మొత్తం  ఛాంపియన్స్ బోర్డు ను ముందు పెట్టుకొని  ఫొటోలకు  ఫోజు ఇచ్చారు. అయితే అందులో  యువ వికెట్ కీపర్ సంజు  సాంసన్  కనిపించలేదు. దాంతో క్రికెట్   అభిమానులకు  అనుమానాలు వచ్చాయి.
 
మూడో టీ 20 లో విఫలమైనందునే సంజు రాలేదని  కొంత మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే  దానికి అసలు కారణం ఏంటంటే మ్యాచ్ ముగిసిన వెంటనే సంజు ఎయిర్ పోర్ట్ కు  వెళ్ళాడు. ఎందుకంటే తాను న్యూజిలాండ్ పర్యటన కు వెళ్లాల్సిన ఇండియా ఏ  జట్టులో ఎంపికైయ్యాడు.  ఆపర్యటన లో  న్యూజిలాండ్ తో  ఇండియా ఏ జట్టు 4వన్డేలు ,2 నాలుగు రోజుల మ్యాచ్ లు ఆడాల్సివుంది.  దాంతో ఆఫోటో లో అతను మిస్ అయ్యాడు.
 
ఇక పూణే టీ20 లో వచ్చిన మంచి అవకాశాన్ని సంజు సాంసన్ సద్వినియోగం చేసుకోలేపోయాడు. ఆమ్యాచ్ లో మూడో స్థానం లో వచ్చిన అతను మొదటి బంతినే సిక్స్ గా తరలించి కోహ్లీని ఆనందపరచగా రెండో బంతికి ఎల్బీ రూపంలో  పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: