బాలీవుడ్ హీరోలు , హీరోయిన్ లూ - క్రికెటర్ లూ , వీరి మధ్య ప్రేమాయణం విషయం అందరికీ తెలిసిందే .. కొన్ని దశాబ్దాలు గా ఇది నడుస్తూనే ఉంది. అప్పట్లో గంగూలీ లాంటి వాళ్ళతో మొదలయ్యి మొన్న మొన్న కొహ్లే వరకూ ఈ కహానీలు సాగుతూనే ఉన్నాయి.  క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే ఆ వార్త హాట్ టాపిక్ కావాల్సిందే.  కోహ్లీ-అనుష్క, జహీర్‌-సాగరిక, హర్భజన్‌-గీతా, యువీ-హజెల్‌ ఇలా చాలామంది పెళ్ళికి ముందే ప్రేమ స్టోరీ లు నడిపి ఫైనల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారు . కుర్ర క్రికెటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఇషా నేగీ తో ప్రేమలో మునిగిపోయి ఉన్న సంగతి తెలిసిందే.

 

 

ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నాం అనే విషయం కూడా మొన్న నూతన సంవత్సరం రోజు ఇంటర్నెట్ లో పోస్ట్ చేసి మరీ ఇంస్టా లో అందరికీ షాక్ ఇచ్చాడు.  అయితే.. ఇటీవల పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు మాజీ ప్రియురాలు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించినా.. పంత్ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. దీంతో పదేపదే విసిగిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తోంది బాలీవుడ్ మీడియా . మైన్ స్త్రీమ్ మీడియా లో కూడా ఈ వార్త ఎక్కువగా వైరల్ అవుతోంది. కానీ ఊర్వశి సన్నిహితుల దగ్గర నుంచి మరొక వాదన వినిపిస్తోంది.

 

 

 

వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్‌ చేసుకున్నారని ఊర్వశి సన్నిహితులు చెప్తుండటం విశేషం. సోషల్ మీడియా దిగ్గజమైన వాట్సప్‌లో ఊర్వశి అకౌంట్‌ను పంత్ తాజాగా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇంస్టా లో పంత్ పోస్ట్ అనంతరం ఊర్వశి అతనితో కాంటాక్ట్ అవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈక్రమంలో వాట్సప్‌లో పలుమార్లు ఊర్వశి ప్రయత్నించడంతో పంత్ బ్లాక్ చేశాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: