గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే క్రికెట్ టోర్నీ టైటిల్ ఫేవరేట్ గా వరుస విజయాలతో భారత్  సెమీస్ కు దూసుకువెళ్లింది . అయితే సెమీస్ లో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలయింది . కీలక సమయం లో జడేజా , ధోని ఇద్దరు రనౌట్ కావడం వల్లే భారత్ జట్టు విజయం సాధించలేకపోయింది . న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది .

 

జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఒక దశలో ఆరు వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే సాధించింది . ఈ దశలో రవీంద్ర జడేజా , ధోని లు నిలకడగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశారు . రవీంద్ర జడేజా (77 ), ధోని (50 )లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ , కీలక  దశలో  జడేజా రనౌట్ కావడంతో అభిమానులు , ఆశలన్నీ ధోనిపైనే పెట్టుకున్నారు . గతం లో ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన ధోని , ఈ మ్యాచ్ లో భారత్ ను గెలిపిస్తాడని భావించారు .

 

చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు కావాల్సిన తరుణం లో పెర్గుసన్ వేసిన ఇన్నింగ్స్ 49 ఓవర్ లో తొలి బంతిని సిక్స్ గా మలిచిన ధోని , రెండవ బంతికి పరుగు రాకపోవడం తో , మూడవ బంతికి లేని పరుగు కోసం ప్రయతించిన రనౌట్ అయిన విషయం తెల్సిందే . చాలాకాలం తరువాత ధోని ఈ రనౌట్ పై స్పందిస్తూ తాను డైవ్ చేసి క్రీజ్ కు చేరి ఉంటే బాగుండేదని అన్నాడు . తాను ఆడిన తొలి మ్యాచ్ లోను , ఆ తరువాత సెమీస్ లో ఒకే తరహా లో రనౌట్ కావడం బాధించే విషయమని చెప్పాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: