బంగ్లాదేశ్ తో సొంత గడ్డపై జరుగనున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కోసం మిస్బాహుల్ హాక్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. ఇటీవల టెస్టులకు రిటైర్ ప్రకిటించిన స్టార్ బౌలర్లు మహమ్మద్ అమీర్ , వాహబ్ రియాజ్ లను ఈ టీ 20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. వీరితో పాటు ఇటీవల
ఆస్ట్రేలియా తో జరిగిన టీ 20 సిరీస్ లో విఫలమైన మరో 5గురు ఆటగాళ్లు.. ఫకర్ జమాన్ , మహమ్మద్ ఇర్ఫాన్ ,అసిఫ్ హాలీ , హారిస్ సోహైల్ ,ఇమామ్ ఉల్ హాక్ లకు కూడా ఉద్వాసన పలికింది.
ఇక బంగ్లా తో టీ 20 సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు మహ్మమద్
హఫీజ్ , షోయబ్
మాలిక్ లను ఎంపిక చేసింది. వీరితోపాటు మరో ముగ్గురు కొత్త వాళ్లు.. అహాసన్
అలీ, హారిస్ రాఫ్, అమ్మాద్ బట్ లకు చోటు కల్పించింది. ఈనెల 24, 25, 27న లాహోర్ వేదికగా
బంగ్లాదేశ్ .
పాకిస్థాన్ ల మధ్య ఈ మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ జరుగనుంది.
పాకిస్థాన్ జట్టు :
బాబర్ అజామ్ (కెప్టెన్) ,హఫీజ్ , షోయబ్ మాలిక్ , అహాసన్ అలీ , ఇమ్మాద్ వాసీమ్, ఇఫ్తికర్ అహ్మద్, హారిస్ రాఫ్, కుష్ దిల్ షా , అమ్మాద్ బట్ ,మహామ్మద్ రిజ్వాన్ ,ఉస్మాన్ ఖదీర్, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మమద్ హుస్నాయీన్, షాదాబ్ ఖాన్ , ముసా ఖాన్