నేడు ఐసీసీ ర్యాంకులు విడుదల అయ్యాయి.. ఈ ర్యాంకింగ్ లో బుమ్రా.. కోహ్లీ టాప్ లేపారు.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడు వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజా వన్డే ర్యాంకులను నేడు విడుదల చేసింది. అయితే ఈ ర్యాంకుల్లో బ్యాటింగ్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 886 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచాడు. 

 

ఇంకా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.. అయితే ఆ తర్వాత బాబర్ ఆజామ్ 829 పాయింట్లతో మూడో ర్యాంకులో, డుప్లెసిస్ 825 పాయింట్లతో నాలుగో ర్యాంకులో, రాస్ టేలర్  810 పాయింట్లతో ఐదో ర్యాంకులో నిలిచారు. ఇంకా బౌలింగ్ లో అయితే టీమిండియా సూపర్ హిట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 764 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచాడు. 

 

ఇంకా బుమ్రా తర్వాత ట్రెంట్ బౌల్డ్ 737 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత ముజీబ్ రహ్మన్ 701 పాయింట్లతో మూడో ర్యాంకులో నిలిచారు. ఇలా ఇద్దరు విరాట్ కోహ్లీ, బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్ లో టాప్ లేపారు. ఇద్దరు మొదటి స్థానంలో నిలిచారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: