గాయం కారణంగా టీమిండియా ఓపెనర్
శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటన నుండి తప్పుకోవడంతో అతని స్థానంలో టీ 20 సిరీస్ కోసం సంజు సాంసన్ ను ఎంపిక చేయగా వన్డే సిరీస్ కోసం
పృథ్వీ షా ను ఎంపిక చేసినట్లు కొద్దీ సేపటి క్రితం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు
యువ ఆటగాళ్లు న్యూజిలాండ్ లోనే వున్నారు. ఈ పర్యటనలో
భారత్ ,
న్యూజిలాండ్ తో టీ 20, వన్డే , టెస్టు సిరీస్ లలో తలపడనుంది. అందులో భాగంగా ఇరు జట్లు మొదట టీ 20 సిరీస్ ఆడనున్నాయి. ఈనెల 24 న
ఆక్లాండ్ లో మొదటి టీ 20మ్యాచ్ జరుగనుంది. అందుకోసం టీమిండియా నేడు
ఆక్లాండ్ చేరుకుంది.
భారత జట్టు (టీ 20 ) :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ,రాహుల్ , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , సంజు సాంసన్ ,శివమ్ దూబే , మనీష్ పాండే , వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శార్దూల్ ఠాకూర్ ,షమీ,రవీంద్ర జడేజా
భారత జట్టు (వన్డే) :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ ,రాహుల్ ,పృథ్వీ షా , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శార్దూల్ ఠాకూర్ ,షమీ ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్