సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ,డుప్లెసిస్ కు షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ తో వన్డే  సిరీస్ కు కెప్టెన్ గా అతన్ని  తొలిగించింది అంతేకాదు డుప్లెసిస్ ను అసలు మొత్తం సిరీస్ కే ఎంపిక చేయలేదు.  ఇక వన్డే లకు  వికెట్ కీపర్ డికాక్  సారథిగా ఎంపికైయ్యాడు అలాగే  ఈ సిరీస్ కోసం బావుమా ,ఎంగిడి  లు  మళ్ళీ జట్టులో చోటు దక్కించుకోగా వీరితోపాటు  5గురు కొత్త వారికి చోటు కల్పించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా సొంత గడ్డపై  ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అందులో భాగంగా  ఇప్పటికీ మూడు టెస్టులు పూర్తికాగా చివరి టెస్టు  ఈనెల 24నుండి ప్రారంభం కానుంది.  ఇది పూర్తయ్యాక  ఇరు జట్ల మధ్య  5వన్డే ల సిరీస్ ప్రారంభం కానుంది. 
 
ఇక నాలుగు టెస్టు ల సిరీస్ లో  ఇంగ్లాండ్ రెండు  టెస్టు లు గెలుచుకొని  2-1 ఆధిక్యం లోకి దూసుకెళ్లింది. జోహెన్స్ బర్గ్  లో  జరుగునున్న చివరి టెస్టు ను  డ్రా  చేసుకున్నా చాలు సిరీస్ ఇంగ్లాండ్ వశం కానుంది. 
 
సౌతాఫ్రికా జట్టు (వన్డే ): 
 
డికాక్ (కెప్టెన్ ,కీపర్), బావుమా , వాన్ డెర్ దుస్సేన్ ,డేవిడ్ మిల్లర్ ,జానెమన్ మలన్ ,జాన్ జాన్ స్మట్స్ ,ఫెహ్లుక్వయో, లుతో సిఫామ్లా ,షంసి ,ఫార్ట్యూన్ ,సీసండా మగలా , కైల్ వెర్రేయన్  ,రిజా హెన్డ్రిక్స్, బ్యురేన్ హెన్డ్రిక్స్, ఎంగిడి

మరింత సమాచారం తెలుసుకోండి: