ఈఏడాది టీమిండియా తన మొదటి విదేశీ పర్యటన ను న్యూజిలాండ్ లో ప్రారభించనుంది. అందులో భాగంగా  రేపు  ఇరు జట్ల మధ్య  మొదటి టీ 20మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా జరుగనుంది.  కాగా మాజీ సారథి ధోని లేకుండా టీ 20ల్లో భారత్ ,కివీస్ తో తలపడడం ఇదే మొదటి సారి.  గత ఏడాది ప్రపంచ కప్ లో  న్యూజిలాండ్ తో సెమిస్  మ్యాచ్ తరువాత ధోని  క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక  మళ్ళీ ధోనిని ఈఏడాది ఐపీఎల్ లోనే చూడనున్నాం. 
 
ఇదిలా ఉంటే మొదటి టీ 20 గెలిచి పర్యటనను ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తుండగా సొంత గడ్డపై గెలిచి  ఆధిక్యాన్ని ప్రదర్శించాలని కివీస్ పట్టుదలతో వుంది. 
 
తుది జట్లు (అంచనా ) : 
భారత్ : రోహిత్ , రాహుల్, కోహ్లీ(కెప్టెన్) , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ ,మనీష్ పాండే , జడేజా, చాహల్ /సుందర్ ,బుమ్రా , సైని , షమీ 
 
న్యూజిలాండ్ : గుప్తిల్ ,మున్రో , విలియమ్సన్(కెప్టెన్), టేలర్ ,సైఫర్ట్ (కీపర్) ,గ్రాండ్ హోమ్ ,డారైల్ మిచెల్ , సాంటినర్  , సౌథీ ,బెన్నెట్ ,ఇష్ సోధి 

మరింత సమాచారం తెలుసుకోండి: