ఎం ఎస్ ధోని.. ఎంతోమంది క్రికెట్ అభిమానుల గుండె చెప్పుడు. అలాంటి ధోని కెరీర్ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతిలో ఉందని చెప్తున్నాడు సురేష్ రైనా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ కోహ్లీ చేతుల్లో ఉందని టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా చెప్పుకొచ్చారు. 

 

గత సంవత్సరం ఆగస్టులో మోకాలికి దెబ్బ తగిలి సర్జీరీ చేయించుకున్న సురేష్ రైనా ఆ సర్జరీ తరవాత క్రికేట్ కు దూరం అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళి క్రికెట్ లోకి వచ్చెనందుకు ఫిట్‌నెస్ సాధించేందుకు సురేష్ రైనా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాగా శ్రమిస్తున్నారు.. ప్రస్తుతం అతని లక్ష్యం ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ లో ఆడటమే అని అయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే ధోని కెరీర్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ధోనీ కూడా ఐపీఎల్ కోసం మార్చి తొలి వారంలో చెన్నైలో నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్‌కి హాజరుకానున్నాడు. టీమిండియాలోకి అతని రీఎంట్రీ అంటారా..? అది ఇప్పుడు పూర్తిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. భారత జట్టుకి కూడా ధోని సేవలు అవసరం ఎంతగానో ఉంది'' అని రైనా వెల్లడించాడు. మరి కోహ్లీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: