న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ 20 లో భారత్ ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో మైదానం లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 6ఓవర్ వేయడానికి  శార్దూల్ ఠాకూర్ రాగ న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్  మున్రో స్ట్రైకింగ్ లో  వున్నాడు.  ఆఓవర్ మొదటి  బంతిని మున్రో డాట్ చేయగా  రెండో బంతిని షాట్ ఆడబోయి మిస్ చేయడంతో  అతని కాలుకు తగిలి  బంతి అక్కడే పడింది.  దాంతో  రన్ కోసం  మున్రో ... బాల్  కోసం  శార్దూల్ ఎదురెదురుగా పరిగెత్తగడంతో ఇద్దరు ఢీ కొన్నారు.  ఈక్రమంలో శార్దూల్ కిందపడిపోయాడు. మున్రో సేఫ్ గా క్రీజ్ లోకి చేరుకున్నాడు.  ఇక కిందపడ్డ  శార్దూల్, మున్రో వైపు  సీరియస్ గా అలాగే చూస్తూ వుండిపోయాడు.  ఆతరువాత  మున్రో ,శార్దూల్ దగ్గరికి వచ్చి సారీ చెప్పడం తో  ఇద్దరు  నవ్వుకుంటూ హైఫై  ఇచ్చుకున్నారు. 
 
 
ఇక ఈ మ్యాచ్ లో భారత్ , కివీస్ పై  7వికెట్ల తేడాతో విజయం  సాధించింది.  రెండు ఓవర్లు వేసిన  శార్దూల్ ఠాకూర్ 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసుకోగా  మొదటి మ్యాచ్ లో 59పరుగుల తో రాణించిన మున్రో  ఈమ్యాచ్ లో 25 బంతుల్లో 26పరుగులే  చేసి నిరాశపరిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: