న్యూజిలాండ్ తో బుధవారం హామిల్టన్ లో జరిగిన మూడో టీ 20 లో టీమిండియా ను గెలిపించినందుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పై దేశమంతా ప్రశంసలు కురిపిస్తుంటే అతను మాత్రం మ్యాచ్ గెలిపించింది నేను కాదని అంటున్నాడు. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 179  పరుగులు చేసింది. రోహిత్ శర్మ 65పరుగులతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన కివీస్  కూడా 179పరుగులు చేయడం తో మ్యాచ్ టై అయ్యింది. 
 
ఆతరువాత మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్  6బంతుల్లో 17పరుగులు చేయగా ..  భారత్ 20పరుగులు చేసి విజయాన్ని సాధించింది. చివరి రెండు బంతులను రెండు సిక్సర్లు గా మలిచి రోహిత్ అసాధారణ విజయాన్ని అందించాడు. అయితే ఇంత చేసి రోహిత్..  గెలిపించింది నేను కాదు ఫాస్ట్ బౌలర్ షమి అని అన్నాడు. మ్యాచ్ అనంతరం  మీడియా తో మాట్లాడిన రోహిత్ ..షమి వేసిన  చివరి ఓవర్ వల్లే మేము మ్యాచ్ గెలువగలిగాం. ఇద్దరు సెట్  బ్యాట్స్ మెన్లుక్రీజ్ లో ఉండడం  మరో పక్క  డ్యూ  పడుతుండడం ఇలాంటి పరిస్థితుల్లో  బౌలింగ్ చేయడంచాలా కష్టం. కానీ షమి  చివరి ఓవర్ లో అద్బుతంగా బౌలింగ్ చేసి  రెండు వికెట్లను తీయడం తో నే మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. దాంతో మేము గెలిచామని  రోహిత్  వ్యాఖ్యానించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: