వెల్లింగ్టన్ వేదికగా
న్యూజిలాండ్,
ఇండియా జట్ల మధ్య నాలుగో టీ 20 మరో కొద్దీ సేపట్లో ప్రారంభం కానుంది. కాగా మ్యాచ్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆజట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో సౌథీ సారథి బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇక ఈమ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. విలియమ్సన్ స్థానం లో
టామ్ బ్రూస్ ను తీసుకోగా గ్రాండ్
హోమ్ కు బదులు మిచెల్ ను తీసుకున్నారు.
ఇక భారత్ జట్టు విషయానికి వస్తే గత మ్యాచ్ హీరోలు రోహిత్ శర్మ ,జడేజా ,షమి కి రెస్ట్ ఇచ్చి వారి స్థానాల్లో సంజు సాంసన్ , వాషింగ్టన్ సుందర్ ,నవదీప్ సైనికి ఛాన్స్ ఇచ్చారు. 5మ్యాచ్ ల ఈసిరీస్ ను ఇప్పటికే 3-0తేడాతో గెలుచుకున్న భారత్.. ఈమ్యాచ్ నుకూడా గెలిచి క్లీన్ స్వీప్ కు మరింత చేరువకావాలని భావిస్తుంది.
తుది జట్లు :
భారత్ : సంజు సాంసన్ ,రాహుల్(కీపర్ ),కోహ్లీ(కెప్టెన్) , శ్రేయాస్ అయ్యర్ ,మనీష్ పాండే ,శివమ్ దూబే ,చాహల్ ,సుందర్ ,బుమ్రా ,సైని ,శార్దూల్ ఠాకూర్
న్యూజిలాండ్ : గప్తిల్ ,మున్రో ,టామ్ బ్రూస్,టేలర్ ,సైఫర్ట్ (కీపర్) ,మిచెల్ , సాంటినర్ , సౌథీ (కెప్టెన్),బెన్నెట్ ,ఇష్ సోధి, కుంగ్ లీన్