న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు టీ - 20ల సిరీస్ లో భాగంగా భారత్ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. శుక్రవారం నాడు జరిగిన నాలుగో టీ - 20లో భారత్ ‘సూపర్ ఓవర్ 'లో విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో మాదిరిగానే ఈ మ్యాచ్ తొలుత టైగా ముగిసింది. దీనితో సూపర్ ఓవర్ నిర్వహించగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 13 పరుగులు చేసింది.
దాని తర్వాత 14 పరుగుల టార్గెట్ ను భారత్ సులువుగా ఛేదించింది. ఇందులో మొదట బ్యాటింగ్లో చేసిన కేఎల్ రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టడంతో 10 పరుగులు వచ్చాయి. కానీ తర్వాతి బంతి అంటే మూడో బాల్ కి రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీ వరుసగా ఒక డబుల్, ఒక ఫోర్ తో జట్టుని విజయ తీరాలకు చేర్చాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొత్తానికి 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇందులో మనీశ్ పాండే 36 బంతుల్లో 50 పరుగులు నాటౌట్ (3 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తర్వాత టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ మొత్తం ఓవర్లు ఆడి కరెక్ట్ గా 165/7 మాత్రమే చేసింది.
ఇందులో కొలిన్ మున్రో 47 బంతుల్లో 64 పరుగులు( 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ శార్దూల్ ఠాకూర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా ఆధిక్యం 4-0కు పెరిగింది. ఇక ఆఖరిదైన ఐదో టీ - 20 మ్యాచ్ మౌంట్ మాంగానీలో ఆదివారం జరుగుతుంది.