మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లికించుకుని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.ఏ  ఇండియన్ టీం కెప్టెన్ కి సాధ్యం కాని  రెండు వరల్డ్ కప్ లని సాధించిపెట్టాడు మహేంద్రసింగ్ ధోని. అంత గొప్ప ఆటగాడైనా మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన చేయడంతో ఆ తర్వాత క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ కు సంబంధించిన వార్త కూడా తెరమీదికి వచ్చింది. 

 

 అయితే తాజాగా న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ధోనిని  అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఈ  మ్యాచ్ లో  వీ  మిస్ యూ  ధోని అంటూ పెద్ద బ్యానర్ ప్రదర్శించారు అభిమానులు. ఈ బ్యానర్  ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఫోటోని  బిసిసిఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్ గా జస్ట్ ఫ్యాన్ థింగ్  అంటూ ట్వీట్ చేసింది బీసీసీఐ. ఇక బిసిసిఐ ఈ పోస్టు పెట్టగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎంతో మంది నెటిజన్లని  ఆకర్షిస్తోంది  ఇక ఎంతో మంది దీనిపై లైకులు కామెంట్లు చేస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే... మహేంద్రసింగ్ ధోని గత ఆరు నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉండగా... ధోని భవిష్యత్తు ఏంటని అందరిలో ఒక ప్రశ్న నెలకొంది. ఇండియా టీం లోకి రీ  ఎంట్రీ ఇస్తాడా లేక తన కెరీర్ కి ముగింపు పలికేస్తాడా అ mన్నది ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరిలో నెలకొన్న ప్రశ్న. కాగా  ఇప్పుడు వరకు  ధోని రిటైర్మెంట్ పై ఎంతో మంది క్రికెటర్లు స్పందించినా.. ధోని  మాత్రం తన రిటైర్మెంట్ పై  స్పందించలేదు. అయితే ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్లో ధోని రాణిస్తే వచ్చే ప్రపంచ కప్ లో  ఆడేందుకు ధోని కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: