న్యూజిలాండ్ గడ్డపై మొదటి సారి భారత్ జట్టు టీ - 20 సిరీస్ క్లీన్స్వీప్ చేయడానికి సన్నదంగా ఉంది. ఇంతక ముందు టీమిండియా అక్కడ రెండు సార్లు టీ20 సిరీస్లు ఆడిన ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. తాజాగా ఈ ఐదు టీ - 20ల సిరీస్ లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్ లలో గెలుపొందిన భారత్ జట్టు ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకి జరిగే ఐదో మ్యాచ్ లోనూ గెలవాలని టీమిండియా భావిస్తుంది. చివరిగా జరిగిన 3, 4వ టీ - 20 మ్యాచ్లు సూపర్ ఓవర్కి వెళ్లడం వాటిని టీమిండియా జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.
భారత్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉండగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా భారీ ఇన్నింగ్స్ ఈ సిరీస్ లో బాకీ ఉన్నాడు. అయితే మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే నిలకడగా రాణిస్తుండటం టీమిండియాకి ఇది సానుకూల అంశం. నాలుగో టీ - 20లో ఫెయిలైన సంజు శాంసన్ కి మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో కూడా బుమ్రా, శార్ధూల్ ఠాకూర్ బౌలర్లు నిలకడగా రాణిస్తుండగా,అయితే నవదీప్ సైనీ లయ అందుకోవాల్సి ఉంది. స్పిన్నర్ చాహల్ కి ఈరోజు మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ ని ఆడించే అవకాశం ఉందని భావించవచ్చు.
అలాగే సొంతగడ్డపై వరుస పరాజయాలతో ఇప్పటికే టీ - 20 సిరీస్ ని ఓడిన న్యూజిలాండ్ ఇప్పుడు వైట్వాష్ పరాభవం ముంగిట నిలబడింది. నిజానికి ఆ టీం చివరి రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచే అవకాశాల్ని ఆఖర్లో చేజార్చుకున్న హోమ్ టీం కనీసం చివరి టీ - 20లోనైనా గెలిచి సొంత అభిమానుల ముందు తలెత్తుకోవాలని ఆ టీం ఆశిస్తోంది. భుజం గాయం కారణంగా నాలుగో టీ - 20కి దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐదో టీ - 20లో ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టీ - 20 సిరీస్ తర్వాత బుధవారం నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ లు ఆడవలిసి ఉంది