ఆదివారం  న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ 20లో టీమిండియా ఆల్ రౌండర్ శివమ్  దూబే  ఓ చెత్త రికార్డు సృష్టించాడు.  ఈమ్యాచ్ లో కివీస్  బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 10ఓవర్  లో బౌలింగ్ కు వచ్చిన దూబే ఆ ఒక్క ఓవర్ లోనే 34 పరుగులు ఇచ్చి  టీ 20 ల్లో  ఒకే ఓవర్ లో  అత్యధిక పరుగులు ఇచ్చిన  మొదటి టీమిండియా  బౌలర్ గా  చెత్త రికార్డు సృష్టించాడు. 10ఓవర్ లో మొదటి మూడు బంతులను 6,6,4 గా మలిచిన సైఫర్ట్  నాల్గో బంతికి సింగిల్ తీశాడు ఆతరువాత 5వబాల్ నోబ్ కాగా దాన్ని ఫోర్ బాదిన టేలర్  మిగిలిన రెండు బంతులకు  రెండు సిక్సర్లు  బాదాడు.  దాంతో  ఒక్క ఓవర్ లోనే  34 పరుగులు రావడం తో మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మొగ్గింది.  అయితే  వెంటనే  మిగితా బౌలర్లు  తేరుకొని  అద్భుతమైన  బౌలింగ్ వేయడంతో  ఈమ్యాచ్ లో కూడా కివీస్ కు  ఓటమి తప్పలేదు. ఈవిజయం తో  5మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను భారత్ 5-0 తేడాతో  క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 
 
ఇక  ఇంతకుముందు  స్టువర్ట్ బిన్నీ  2016లో వెస్టిండీస్ తో జరిగిన టీ 20లో ఓకే ఓవర్ లో 32పరుగులు ఇవ్వగా  తాజాగా దూబే  ఆ రికార్డు ను బ్రేక్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: