ఇటీవల ఆస్ట్రేలియా అడవుల్లో చెలరేగిన  కార్చిచ్చు ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. అగ్ని కీలలకు ఆస్ట్రేలియా లోని కొన్నిలక్షలహెక్టార్లలో అడవులు బూడిద కాగా కొన్ని కోట్ల వన్యప్రాణాలు అగ్నికి ఆహుతైయ్యాయి  అయితే ప్రస్తుతం అక్కడ  వర్షాలు పడుతుండడం తో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇక కార్చిచ్చు బాధితుల సహాయార్థం బుష్ ఫైర్ పేరిట మాజీ క్రికెటర్లు ఓ  ఛారిటీ మ్యాచ్ ఆడనున్నారు. 
 
ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ఎలెవెన్ ,మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ఎలెవన్ మధ్య  ఈమ్యాచ్ జరుగనుంది. ఇక టీమిండియా మాజీ ఆల్ రౌండర్  యువరాజ్ సింగ్, గిల్ క్రిస్ట్ ఎలెవన్ తరుపున బరిలోకి దిగనున్నాడు. అలాగే పాంటింగ్ టీం కు మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్ కాగా గిల్ క్రిస్ట్ టీం కు టీం పైన్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఈ 10ఓవర్ల లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ సిక్స్ లో ఈమ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 
 
పాంటింగ్ ఎలెవన్ : పాంటింగ్ (కెప్టెన్), లాంగర్,లారా , హేడెన్ ,విలైని ,లీచ్ ఫీల్డ్ ,హాడిన్ ,లీ ,అక్రమ్ ,క్రిస్టియన్ ,హాడ్జ్  
 
గిల్ క్రిస్ట్ ఎలెవన్ : గిల్ క్రిస్ట్ ,వాట్సన్ ,బ్రాడ్ హాడ్జ్ ,యువరాజ్ సింగ్,బ్లాక్ వెల్ , సైమండ్స్ ,వాల్ష్ ,రైవల్డ్ట్ ,సిడిల్ ,? , అహ్మద్ (మరొక ఆటగాడి పేరు తెలియాల్సివుంది.)

మరింత సమాచారం తెలుసుకోండి: