టీమిండియా మాజీ సారథి ధోని కొత్త లుక్ అభిమానులను ఫిదా చేసింది. నిన్న చార్టెడ్ ప్లైట్ లో అనంతపురానికి వచ్చిన  ధోని, పుట్టపర్తి సత్య సాయి మహా సమాధిని దర్శించుకున్నాడు. ట్రస్ట్ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయం లో  ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్ డాక్టర్ ముత్తు.. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో విజిటింగ్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నాడు. దాంతో  వైద్య పరీక్షల కోసం ధోని  పుట్టపర్తి వచ్చినట్లు వెల్లడించాడు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. కాగా ధోని అనంతపురం లో  ప్రత్యక్షం కావడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో కొత్త లుక్ లో ధోని అదరగొట్టాడు. మునపటి కన్నా మరింత యంగ్ గా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. 
 
 
ఇదిలా వుంటే గత ఏడాది వన్డే ప్రపంచ కప్  సెమిస్ లో న్యూజిలాండ్ తో ఓటమి తరువాత క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించాడు ధోని..  అప్పటి నుండి  ఫ్యామిలీతో  బిజీగా గడుపుతున్నాడు.  అయితే త్వరలో ఐపీఎల్ తో ధోని మళ్ళీ మైదానం లోకి అడుగుపెట్టనున్నాడు.  చెన్నై సూపర్ కింగ్స్ సారథి అయిన ధోని పునరాగమనం  కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈఏడాది ఆస్ట్రేలియా లో జరుగనున్న టీ 20ప్రపంచ కప్ తరువాత ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: