రిషబ్ పంత్... అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన బ్యాటింగ్ తో, కీపింగ్ తో ఆకట్టుకున్నాడు. ధోని వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు, తక్కువ వ్యవధిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కావడం, కీపింగ్ కావడంతో టీం ఇండియా గిల్కరిస్ట్ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేసారు. 

 

ఆ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసిసిఐ చీఫ్ గంగూలీ మద్దతు ఉండటంతో జట్టులో ఆశించిన స్థాయిలో మంచి ప్రదర్శన చేయకపోయినా సరే పంత్ ని కొనసాగిస్తూ వచ్చాడు కెప్టెన్ కోహ్లీ. అయితే ఇతను మాత్రం ఆ అవకాశాలను వాడుకోకుండా, విరామం దొరికిన ప్రతీసారి కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో టూర్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయాడు. 

 

కెఎల్ రాహుల్ కీపర్ గా రాణించడంతో పంత్ బెంచ్ కే పరిమితం అయిపోయాడు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా కూడా పంత్ ఇలాగే చక్కర్లు కొట్టాడు. దీనిపై ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి. కెరీర్ మొదట్లో ఉన్నావని, ఈ తరుణంలో నీకు ఇలాంటివి అవసరమా అంటూ పలువురు కామెంట్లు చేసారు. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసారు పంత్. ఇక ఆమెతో కలిసి విదేశాలకు వెళ్ళడం కూడా చేసాడు. 

 

కోహ్లీ వార్నింగ్ ఇచ్చినా సరే పంత్ లో మార్పు రాలేదని ఆరోపించారు కొందరు. మీడియా కూడా అతని చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ముగ్గురితో నిండా పాతికేళ్ళు కూడా రాకుండానే పంత్ ప్రేమ పాఠాలు నేర్చుకున్నాడు. ఇలాగే కొనసాగితే కెరీర్ కష్టమని, ఇది మార్చుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అటు గంగూలీ కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: