ఇండియాలో క్రికెట్ కి ఎంతగానో క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. క్రికెట్ ఆటకు కోట్లల్లో అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు. అయితే మిగతా మ్యాచ్లకు క్రేజ్ ఎలా ఉన్నప్పటికీ ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ సందడి కాస్త డబుల్  అయిపోతుంది. ఇప్పటివరకు ఇండియా జట్టులో కలిసిమెలిసి ఆడిన ఆటగాళ్ళందరూ ఐపీఎల్లో ప్రత్యర్థులుగా మారిపోయి హోరాహోరీగా పోటీపడతారు . ఇక ఇండియన్ ఆటగాళ్లకు విదేశీ ఆటగాళ్లు కూడా తోడవడంతో ఆట మరింత నవతరంగం సాగుతోంది.అయితే  ఐపీఎల్ మొత్తంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏది అంటే ఆర్సిబి . ఈ జట్టులో ప్రపంచంలోనే అత్యున్నత ఆటగాళ్లు అందరూ ఉంటారు అంతకుమించి.. టీమిండియా జట్టు సారథి విరాట్ కోహ్లీ ఈ  జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తూ ఉంటారు.

 


 అయితే ఆర్సీబీ  జట్టుకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ప్పటికీ ఇప్పటివరకు ఆర్సీబీ  జట్టు ఒక్కసారి కూడా ప్లే ఆప్స్  కు క్వాలిఫై అయింది లేదు టైటిల్ కొట్టింది లేదు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ... ఆర్సీబీ  మాత్రం ఇప్పటివరకు విజయం సాధించలేకపోయింది. దీంతో ఇప్పటికే ఆర్సిబి జట్టు ఎన్నో విమర్శలు పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ఆలోచన తో ఉంది ఆర్సిబి. ఈ సారి జట్టులో  పలు కీలక మార్పులు చేసింది. నిన్నటికి నిన్న ఆర్సిబి సోషల్ మీడియా ఖాతాలో  ఆర్సీబీ ప్రొఫైల్ పిక్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే.దీంతో  ఆర్సిబి లో కీలక మార్పులు తప్పు అని అందరూ ఊహించారు.

 


 ఇక అందరూ ఊహించినట్లుగానే ఆర్సీబీ పలు మార్పులను చేపడుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలాగైనా టైటిల్ గెలవాలి అనే కసితో బరిలోకి దిగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... పలు కీలక మార్పులు చేసుకుంటుంది. ఇందులో భాగంగా మారిన జట్టు కొత్త లోగోను  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు మారుతుంది అని జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఆర్సి బిఐ ప్రాంచైజీ  ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: