క్రికెట్ లో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్, విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు  క్రికెట్ లో కాదు..  దేశ వ్యాప్తంగా కోహ్లీ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  సోషల్ మీడియా లో కోహ్లీ ఫాలోయింగ్  తెలిస్తే మతి పోవడం ఖాయం. ఇంస్టాగ్రామ్ లో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 5కోట్లకు చేరింది. తద్వారా ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మొదటి భారతీయుడు గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 
 
ఇక అలాగే కోహ్లీకి  ట్విట్టర్ లో 33.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా పేస్ బుక్ లో 37 మిలియన్ల ఫాలోవర్లు వున్నారు దీన్ని బట్టి చెపొచ్చు కోహ్లీ క్రేజ్ ఏంటో..  ఇక ప్రస్తుతం కోహ్లీ బ్రాండ్ వాల్యూ 170.9 మిలియన్ డాలర్లకు చేరింది. దాంతో ఇండియా లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రెటీల జాబితాలో కోహ్లీ మొదటి స్థానం లో నిలిచాడు. ఇక క్రికెట్ విషయానికి వస్తే ప్రస్తుతం మూడు ఫార్మట్ లలో 50కిపైగా సగటు కలిగిన ఏకైక  క్రికెటర్ కూడా కోహ్లీనే కావడం విశేషం. అయితే ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సాధించిన కోహ్లీ ముందు ప్రస్తుతం రెండు పెద్ద సవాళ్ళే వున్నాయి అందులో ఒకటి తన సారథ్యం లో ఐపీఎల్  ట్రోఫీని గెలవడం అలాగే మరొకటి తన హయాంలో ఐసీసీ ట్రోఫీ ను నెగ్గడం ఈ రెండు నెరవేర్చుకుంటే కోహ్లీ ,ధోని  సరసన నిలువడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: