భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఎక్క‌డ ఉన్నా ఏం చేసినా పెద్ద న్యూస్‌. వీరి వార్త‌ల కోసం దేశ‌వ్యాప్తంగా కోట్లాది మంది తెగ సెర్చ్ చేస్తుంటారు. వీరు ఏం చేసినా.. సోష‌ల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయిపోతోంది. తాజాగా భార‌త జ‌ట్టు ప్రస్తుతం కివీస్ తో దైపాక్షిక సిరీస్‌లో భాగంగా.. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. అక్క‌డే విరాట్‌ కోహ్లీ ఉన్నారు. కాగా.. వన్డే సిరీస్‌ ముగిసిన తర్వా అనుష్క శర్మతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.

 

ఈ విహార యాత్ర‌లో ఈ దంప‌తుల‌తో పాటు సీనియర్ బౌలర్ల మహ్మద్‌ షమీ, నవ్‌దీప్‌ సైనీలు వారుతో కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం. ఇక  శుక్ర‌వారం నుంచి భార‌త్ - న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే అనుష్క భార‌త్‌కు వ‌చ్చేస్తోంది.

 

కోహ్లీని విడిచి వ‌స్తోన్న క్ర‌మంలో అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. 'వీడ్కోలు చెప్పడం సమయంతో పాటు తేలికవుతుందని భావిస్తుండొచ్చు. కానీ.. అది ఎప్పటికీ జరగదు' అని విరాట్ కోహ్లీతో దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్ ఫొటో అనుష్క అభిమానుల‌తో పంచుకున్నారు. ఏదేమైనా కోహ్లీని వీడి భార‌త్‌కు వ‌స్తోన్న క్ర‌మంలోనే అనుష్క కాస్త ఇలా ఫీల్ అయ్యి త‌న బాధ‌ను పంచుకున్న‌ట్టు ఉంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: