ప్రపంచంలోనే అతిపెద్ద
క్రికెట్ స్టేడియం
అహ్మదాబాద్ లోని మొతేరా ప్రారంభానికి ముస్తాబైంది. ఈ స్టేడియాన్ని ఈనెల 24న భారత
ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి
అమెరికా అధ్యక్షుడు
డోనాల్డ్ ట్రంప్ ప్రారంభోత్సవం చేయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ స్టేడియం కు సంబందించిన ఫొటోలు సోషల్
మీడియా లో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా బీసీసీఐ తన అధికారిక
ట్విట్టర్ ఖాతాలో మొతేరా ఎరియల్ వ్యూ పిక్ ను పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు సూపర్ అంటూ మొతేరా ఇండియాకే గర్వకారణమని కామెంట్లు పెడుతున్నారు. 110 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన వున్నఈ స్టేడియాన్ని 700కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇంతకుముందు
ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచలో అతి పెద్ద స్టేడియంగా ఉండగా తాజాగా మొతేరా దాన్ని వెనక్కి నెట్టి అతిపెద్ద
క్రికెట్ స్టేడియం గా అవతరించింది.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి లో ఇంగ్లాండ్, భారత్ లో పర్యటించనుంది. ఈ టూర్ లో భాగంగా ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగనుండగా అందులో ఒక టెస్టును డే-నైట్ నిర్వహించాలని తాజాగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ డే-నైట్ టెస్టు మొతేరాలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.