సాధారణంగా ఇద్దరు గొడవ పడుతుంటే ఆపడానికి ట్రై చేస్తారు ఎవరు అయినా సరే. ఇలాగే ఆపి ఒక వ్యక్తి బలైపోయాడు పాపం. అసలు ఎం జరిగింది...? ఆ గొడవ ఏంటీ అనేది ఈ స్టొరీలో చూడడం. గత ఏడాది నవంబర్ 17న ఫ్రాన్స్‌కు చెందిన  టెర్‌విల్, సోట్రైక్ టీంలు స్థానిక లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ ఆడాయి. మ్యాచ్ అయిన తర్వాత ప్రత్యర్ధి జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్ళు పెద్ద గొడవకు దిగారు. 

 

వారిని వారించి రాజీ కుదర్చడానికి గానూ టెర్‌విల్‌కు చెందిన ఒక క్రీడా కారుడు వారి మధ్యలోకి వెళ్ళాడు. అయినా సరే వివాదం ఆగలేదు. వాళ్ళు గొడవ పడటమే కాకుండా రాజీ కుదర్చడానికి వచ్చిన ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోరికేసాడు. దీనితో రాజీ కుదిర్చిన వ్యక్తికి తీవ్ర రక్త స్రావమవడంతో వెంటనే బాదితుడ్ని ఆస్పత్రికి తరలించారు. మర్మాంగంపై కొరకడంతో డాక్టర్లు మర్మాంగంపై 10 కుట్లు వేసారు. 

 

దీనిపై విచారణ జరిపిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సదరు బాధితుడిపై దాడి చేసిన క్రీడాకారుడికి ఐదేళ్ల నిషేధం విధించారు అధికారులు. ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పుందని తేల్చిన అధికారులు బాధితుడిపై కూడా ఆరెనెలల నిషేధం విధించడం గమనార్హం. ఈ ఘటన ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: