ప్రపంచంలో ఎక్కువ స్టేడియాలు ఉన్న దేశం భారత్. ఎన్నో దేశాల్లో ఎన్నో ఆటలకు సంబంధించి స్టేడియాలు ఉన్నా భారత్లో ఉన్నన్ని స్టేడియాలు ఎక్కడా .. ఏ దేశంలో కూడా లేవు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పెద్ద స్టేడియాలు రెండూ మన దేశంలోనే ఉన్నాయి. ఇక ఎత్తైన స్టేడియం విషయానికి వస్తే అది హిమాచల్ప్రదేశ్లోని చైల్ క్రికెట్ గ్రౌండ్.
దీనిని 1893లో దీన్ని చైల్ మిలిటరీ స్కూల్లో భాగంగా నిర్మించారు. బ్రిటీషర్ల పాలనా కాలంలో ఇది నిర్మించారు. ఈ స్టేడియం సముద్రమట్టానికి 2,444 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే దాదాపు 8వేల 18 అడుగుల ఎత్తులో అన్నమాట. భుపేందర్ సింగ్ మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో దీన్ని నిర్మించాడు. ఆ రాజు గొప్ప క్రికెట్ ప్రేమికుడని చరిత్ర చెబుతోంది. ఈ గ్రౌండ్లో ఇటీవలే క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించారు. గతంలో ఈ స్టేడియంలో పోలో (గుర్రాలాట), బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆడేవారు.
ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం విషయానికి వస్తే అది గుజరాత్లో ఉంది. తాజాగా పునర్ నిర్మించిన అహ్మదాబాద్లోని మొతేరా మైదానం ఈ అరుదైన గుర్తింపు దక్కించుకోనుంది. ఈ స్టేడియం ఇప్పటి వరకు ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ను ఇది వెనక్కి నెట్టేయనుంది. ఈ స్టేడియాన్ని గతంలో 1982లో నిర్మించగా.. అప్పట్లో 49 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉండేది.
సునీల్ గవాస్కర్ ఈ స్టేడియంలోనే టెస్టు క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెండుల్కర్ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసింది కూడా ఇక్కడే. ఇప్పుడు ఈ మైదానం కెపాసిటీ లక్షకు పెంచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడేది ఇక్కడే కావడం విశేషం.