ఆసియా ఎలెవన్ మరియు వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరుగనున్న రెండు టీ 20ల కోసం జట్టును ప్రకటించింది బీసీబీ. ఆసియా ఎలెవన్ తరుపున మొత్తం 6గురు భారత ఆటగాళ్లు ఎంపికైయ్యారు. అయితే వారిలో కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్ కే అందుబాటులో వుండనుండగా కోహ్లీ అందుబాటులో ఉంటాడో లేదో స్పష్టత రావాల్సి వుంది. మార్చి18, 21న ఈరెండు టీ 20 లు మిర్పూర్ లోని షేర్ -ఏ- నేషనల్ స్టేడియంలో జరుగనున్నాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి సందర్భంగా  బంగ్లా  క్రికెట్ బోర్డు ఈమ్యాచ్ లను నిర్వహించనుందని తెలిసిందే. 
 
ఆసియా ఎలవెన్ జట్టు :  విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్ ,శిఖర్ ధావన్ ,షమి ,కుల్దీప్ యాదవ్, ముష్ ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ ,తమీమ్ ఇక్బాల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ ,ముజీబ్ ఉర్ రెహ్మాన్, సందీప్ లమిచ్చానే, తీసారా పెరెరా ,మలింగా 
 
వరల్డ్ ఎలెవన్ జట్టు : అలెక్స్ హేల్స్ ,క్రిస్ గేల్, ఫాప్ డు ప్లెసిస్ (కెప్టెన్ ),నికోలస్ పూరన్,రాస్ టేలర్ ,జానీ బెయిర్ స్టో, పొలార్డ్ ,అదిల్ రషీద్ ,షెల్డన్ కాట్రేల్ ,ఎంగిడి ,ఆండ్రూ టై,మిచెల్ మెక్లానెగెన్  

మరింత సమాచారం తెలుసుకోండి: