గత ఏడాది జరిగిన  ప్రపంచ కప్ లో సెమిస్ లో టీమిండియా ఓటమి తరువాత క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించిన భారత జట్టు మాజీ సారథి ధోని  మళ్ళీ మైదానంలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఐపీఎల్ స్టార్ట్ కానుండగా మార్చి 2నుండి చెన్నై లోని చిదంబరం స్టేడియం లో ధోని సాధన చేయనున్నాడు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెఫుల్ టీం గా వెలుగొందుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని సారథి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ధోని తో కలిసి సీనియర్ ఆటగాళ్లు రాయుడు , రైనా ప్రాక్టీస్ లో పాల్గొననున్నారు. అయితే చెన్నై టీం రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం మార్చి 19నుండి స్టార్ట్ కానుంది. 
 
ఇక ఇటీవల జరిగిన వేలం లో పలువురు ఆటగాళ్లను దక్కించుకోవడంతో చెన్నై మరింత బలంగా కనిపిస్తుంది. కాగా ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29ప్రారంభం కానుండగా ఓపెనింగ్ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది చెన్నై. ముంబై లోని వాంఖడే లో ఈ మ్యాచ్ జరుగనుండగా  ఫైనల్ కూడా అక్కడే జరుగనుంది. 
 
చెన్నై సూపర్ కింగ్స్ : ధోని (కెప్టెన్/కీపర్),వాట్సన్ ,డుప్లెసిస్ ,రైనా ,రాయుడు , జాదవ్, దీపక్ చాహర్ , శార్దూల్ ఠాకూర్ ,పీయూష్ చావ్లా , జడేజా , డ్వేన్ బ్రావో ,కరణ్ శర్మ ,ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్ , సామ్ కర్రన్, మురళి విజయ్ , జోష్ హెజెల్ వుడ్, సాన్ ట్నర్, ఎంగిడి, మోను కుమార్, ఆసిఫ్, సాయి కిషోర్, రుత్ రాజ్ గైక్వాడ్ , జగదీషన్

మరింత సమాచారం తెలుసుకోండి: