ఐపీఎల్ సీజ‌న్ స్టార్ట్ అయ్యిందంటే చాలు దేశ‌వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల సంతోషం మామూలుగా ఉండ‌దు. సుమారు రెండు నెల‌ల పాటు క్రికెట్ ప్రేమికుల‌ను ఎంతో ఆనంద ప‌రిచే ఈ గేమ్ ఈ యేడాది సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఐపీఎల్‌లో పాల్గొనే ఎనిమిది జ‌ట్ల‌కు సంబంధించిన ఆట‌గాళ్లు గేమ్‌లో పాల్గొనేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు సంబంధించి మరో స్టేడియం అరంగేట్రం షురూ అయ్యింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలోనే బరస్పరా స్టేడియంలో ఈ సీజ‌న్ ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.



గుహ‌వాటీ స్టేడియంలో ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగాయి. ఈ స్టేడియంలో ఈ సీజ‌న్ నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బరస్పరా స్టేడియంలో రెండు మ్యాచ్‌లో జరగనున్నాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గుహ‌వాటిని త‌మ హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఈ గ్రౌండ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండు మ్యాచ్‌లు కూడా ఆడ‌నుంది. బరస్పరా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు  బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.



ఏప్రిల్‌ 5వ తేదీ, 8వ తేదీల్లో బరస్పరాలు మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి గం.8..00ని.లకు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు జరిగే ఐపీఎల్‌ టోర్నీలో ఎప్పటిలాగే రాత్రి మ్యాచ్‌లు 8 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: