అవును.. హార్దిక్ పాండ్య రీఎంట్రీ అదిరిపోయింది అంటే నమ్మండి.. గాయం నుండి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన భారత్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాళీ టోర్నీలో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి అందరికి షాక్ ఇచ్చాడు.. డీవై పాటిల్ టీ20 కప్లో భాగంగా రిలయన్స్ 1 తరపున హార్దిక్ పాండ్య బరిలోకి దిగాడు.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన మ్యాచ్లో నాలుగో స్థానంలో ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించాడు. అయితే 25 బాల్స్ లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం అనే చెప్పాలి. హార్దిక్ పాండ్యా తాజా ప్రదర్శనతో టీమిండియాలో రీఎంట్రీ కంఫర్మ్ అని అంటున్నారు విశ్లేషకులు.
కాగా గతేడాది అక్టోబర్లో గాయం అయ్యి భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుని, తాను పూర్తి ఫిట్గా మారినట్లు టీమిండియా మేనేజ్మెంట్కు సంకేతాలు పంపాడు. అయితే హార్దిక్ పాండ్య జనవరిలో న్యూజిలాండ్ టూర్కు టీమిండియాలో ఆడతాడని అందరూ భావించినప్పటికీ ఫిట్నెస్ సమస్యలతో తను టూర్ నుండి వైదొలిగాడు. కానీ ఈరోజు ప్రదర్శన చూస్తే మాత్రం త్వరలోనే రీఎంట్రీ ఉండనుంది అనేది అర్థం అవుతుంది.