ఇండియా తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తరువాత వన్డే ఫార్మట్ కు దూరంగా వున్న మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ఈసిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో  స్పిన్నర్ శంసి ఈసిరీస్ కు దూరంకాగా జార్జ్ లిండే ను మొదటి సారి వన్డేల్లోకి ఎంపిక చేశారు. మార్చి 12న ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక చీఫ్ సెలక్టర్ ఏంఎస్కె ప్రసాద్ నేతృత్వంలో ఈ వారం లో దక్షిణాఫ్రికా తో తలపడనున్న భారత జట్టును ప్రకటించనుంది బీసీసీఐ.
 
ఇదిలావుంటే గత కొంత కాలంగా ఇంటా బయట వరస సిరీస్ లను ఓడిపోతూ విమర్శలను ఎదుర్కొంటుంది సౌతాఫ్రికా.  ప్రస్తుతం ఆజట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియా తో మూడు వన్డే ల సిరీస్ లో తలపడుతుంది. అందులో భాగంగా శనివారం జరిగిన మొదటి వన్డే లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మరి కనీసం ఈసిరీస్ అయినా గెలుస్తుందో చూడాలి. 
 
భారత్ తో సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు : 
 
డికాక్ (కెప్టెన్ ,కీపర్), బావుమా ,వాన్ డెర్ దుస్సేన్ ,డేవిడ్ మిల్లర్ ,డు ప్లెసిస్ ,జాన్ జాన్ స్మట్స్ ,ఫెహ్లుక్వయో ,లుతో సిఫామ్లా ,లిండే ,కైల్ వెర్రేయన్నే ,బ్యురేన్ హెన్డ్రిక్స్, ఎంగిడి, నోర్జే, కేశవ్ మహారాజ్, క్లాసెన్

మరింత సమాచారం తెలుసుకోండి: