మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లమధ్య జరిగిన రెండో వన్డేలో  సౌతాఫ్రికా 6వికెట్ల తేడాతో విజయం సాధించి  2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బౌలింగ్ లో 6వికెట్లు తీసి  ఆసీస్ ను యువ ఫాస్ట్ బౌలర్ ఎంగిడి  కట్టడి చేయగా ఆ తరువాత 129పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు సౌతాఫ్రికా ఓపెనర్ జానెమన్ మలాన్. దాంతో వీరిద్దరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  దక్కింది. ఈ మ్యాచ్ లో మొదటఆసీస్ 50 ఓవర్ల లో 271 పరుగులకు ఆల్ అవుట్ కాగా 4వికెట్లు కోల్పోయి 48.3ఓవర్ల లో 4వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా విజయాన్ని సాధించింది. 
 
ఇక ఆసీస్ ఈఏడాది వన్డే సిరీస్ ఓడిపోవడం వరసగా ఇది రెండో సారి. ఇంతకుముందు జనవరి లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను కూడా ఓడిపోయింది ఆసీస్. ఇదిలావుంటే 2011 తరువాత ఇంతవరకు సౌతాఫ్రికా గడ్డ పై కంగారులు వన్డే సిరీస్ ను గెలవకపోడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం జరుగనుంది దాంతో ఆసీస్ పర్యటన ముగియనుంది. ఈమ్యాచ్ తరువాత సౌతాఫ్రికా, ఇండియా కు రానుంది. అందులో భాగంగా భారత్ తో మూడు వన్డే ల సిరీస్ లో తలపడనుంది. కాగా ఆసీస్ స్వదేశం లో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: