బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మోర్తజా సారథ్య బాధ్యతలనుండి తప్పుకోనున్నట్లు గురువారం ప్రకటించాడు. శుక్రవారం జింబాబ్వే తో జరుగనున్న మూడో వన్డేనే కెప్టెన్ గా తనకు చివరి మ్యాచ్ అని వెల్లడించిన మొర్తాజా ఒక వేళ ఆతరువాత కూడా జట్టులో ఉంటే నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని అన్నాడు అలాగే ప్రస్తుతం జట్టులో ముగ్గురు అత్యంత అనుభజ్ఞులున్నారు వారిలో  బీసీబీ ఎవరో ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేస్తుంది.. కాబోయే కెప్టెన్ కు ఆల్ ది బెస్ట్, అతనికి నా సహకారం ఎప్పుడు ఉంటుందని మోర్తజా మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఇక తన కెప్టెన్సీ లో బంగ్లా కు మోర్తజా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. 
 
ఇదిలావుంటే జింబాబ్వే తో జరుగనున్న రెండు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీబీ. మార్చి 9,11 న ఇరుజట్ల  మధ్య రెండు టీ 20 లు జరుగనున్నాయి. ఇప్పటికే  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. 
 
బంగ్లాదేశ్ జట్టు : 
మహమ్మదుల్లా(కెప్టెన్),తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ ,నయిం షేక్ ,లిటన్ దాస్,ముష్ ఫికర్ రహీం,అఫిఫ్ హుస్సేన్,సైఫుద్దీన్,మెహదీ హాసన్ ,అమినుల్ ఇస్లాం,ముస్తాఫిజుర్ రహ్మన్,షఫీయుల్ ఇస్లాం,ఆల్ అమిన్ హుస్సేన్,హాసన్ మహమూద్, నసుమ్ అహ్మద్

మరింత సమాచారం తెలుసుకోండి: