మొన్నటి వరకు న్యూజిలాండ్ సిరీస్ తో బిజీగా ఉన్న భారత జట్టు నాలుగు రోజుల్లో స్వదేశంలో మరో సిరీస్ సమరానికి సిద్ధం కాబోతుంది. భారత్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో మార్చి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఇందులో భారత ఓపెనర్లగా శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగనుండగా మరో ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతిని ఇచ్చారు. 

 

 

ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో భువనేశ్వర్ కుమార్, బూమ్రా, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్‌లతో బౌలింగ్ విభాగం బాగానే ఉంది. మార్చి 12న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ధర్మశాల స్టేడియంలో టీమిండియా, సౌతాఫ్రికాతో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో మొత్తం మూడు వన్డేలు ఆడనున్నారు.  

 

భారత సెలెక్టర్లు ఈరోజు సిరీస్ కి గాను ప్రకటించిన టీమిండియా జట్టు పూర్తి వివరాలివి. ఇక టీమిండియా జట్టుని చూస్తే...  శిఖర్ ధావన్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ర్పిత్ బూమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: