కరోనా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ మన దేశాన్ని కూడా కాబలించేస్తుంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ లను తాకేలా ఉంది. ఈ నెల 29 నుంచి ఐపీఎల్ - 2020 సీజన్ ప్రారంభంకానుండగా, అయితే ఇప్పుడు బెంగళూరులో మ్యాచ్‌ లని నిర్వహించొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక గవర్నమెంట్ లేఖ రాసినట్లు సమాచారం తెలుస్తుంది. కాకపోతే దీనికరణం లేకపోలేదు. ఇప్పటికే  బెంగళూరులో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దింతో ఐపీఎల్ - 2020 సీజన్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మొత్తం 7 మ్యాచ్‌ లను ఆడనుంది.

 

 


కాకపోతే ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. అయితే, మ్యాచ్‌ ల సమయంలో వేలాది మంది ఒకేచోట స్టేడియంలో ఉంటారు కాబట్టి, పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఆ లేఖలో కర్ణాటక గవర్నమెంట్ తేలిందంటా. దీనితో బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్‌ లు జరగక పోవచ్చని అర్ధం అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: