ఐపీఎల్ 2020 సీజన్ వచ్చే నెల 15కు వాయిదా కావడంతో క్రికెటర్లంతా సేదతీరుతున్నారు. ఆ మెగాటోర్నీ కోసం చెన్నై చేరుకొన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోనీ కూడా తన స్వస్థలం రాంచీకి తిరిగి చేరుకున్నాడు.అయితే తాజాగా రాంచీలో తన మోటార్ బైక్పై చక్కర్లు కొట్టడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మహేంద్రుడు బైక్పై వెళుతుంటే అతని చుట్టూ ఫ్యాన్స్ అందరూ గుమిగూడారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఒక వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది క్షణాల్లో అలా వైరలైంది.
తన దగ్గర ఉన్న విలాసవంతమైన బైక్ పై కూర్చుని చాలా స్టైల్ గా ధోనీ ఈ వీడియోలో ధోని కన్పిస్తున్నాడు. దింతో అక్కడ ఉన్న అభిమానులు ధోనీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంకోవైపు కరోనా వైరస్ చేత ఐపీఎల్ టోర్నీ అసలు జరుగుతుందో లేదో అర్ధం కావట్లేదు. నిజానికి ఈనెల 29 నుంచి ముంబై వాంఖెడే స్టేడియంలో మొదలు కావాల్సిన ఐపీఎల్ అదికాస్తా వచ్చేనెల 15కు వాయిదా పడింది. కరోనా వైరస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడిన ఐపీఎల్ ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ బోర్డు వర్గాలు చెబుతన్నాయి.