టీమిండియా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా రెండోసారి తండ్రైయ్యాడు. అతని సతీమణి ప్రియాంక చౌదరి రైనా ఈరోజు ఉదయం మగ బిడ్డ కు జన్మనిచ్చింది. దాంతో సోషల్ మీడియా వేదికగా క్రికెటర్లు ,అభిమానులు రైనాకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈదంపతులకు 4ఏళ్ళ కూతురు వున్న విషయం తెలిసిందే. ఆమె పేరు గ్రాసియా రైనా కాగా తాజాగా రైనా తన కొడుకుకు రియో రైనా గా నామకరణం చేశాడు.
ఇదిలావుంటే గత కొంత కాలంగా టీమిండియా లో చోటు కోల్పోయిన
రైనా ఈఏడాది ఐపీఎల్ లో రాణించి టీ 20 జట్టులో స్థానం సంపాదించలనే లక్ష్యం తో సాధన చేస్తున్నాడు అయితే ఈ సారి ఐపీఎల్ నిర్వహణ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం దేశం లో
కరోనా విజృంభిస్తుండడంతో ఈనెల 29 నుండి జరుగాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ ను ఏప్రిల్ 15వరకు వాయిదా వేశారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈఏడాది ఐపీఎల్ జరిగేట్లు కనిపించడం లేదు. కాగా ఐపీఎల్ లో మోస్ట్
సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ లలో ఒకటైన
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున
రైనా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతేకాదు
ధోని తరువాత ఆ టీంలో అత్యధిక ఫాన్స్ ను సంపాదించుకున్న ఆటగాడు కూడా
రైనా నే కావడం విశేషం. ఇక
కరోనా ప్రభావం తో ఒక్క
క్రికెట్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగాల్సిన వివిధ క్రీడా టోర్నీలు రద్దయ్యాయి.