2019 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న MS ధోని.. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో IPL - 2020 సీజన్‌ లో ఫామ్ నిరూపించుకోవడం ద్వారా భారత్ జట్టులోకి సులువుగా తిరిగి ఆగమనం చేయాలని ఆశించాడు. కాకపోతే, ఇప్పుడు ఐపీఎల్ రద్దయ్యే సూచనలు ఎక్కువగా ఉండడంతో.. ధోనీ పరిస్థితి ఎటూ
 అంటూ తేల్చుకోలేకపోతున్నాడు.

 


అయితే ఇది ఇలా ఉండగా ఈ భారత మాజీ కెప్టెన్ MS ధోనీకి సుదీర్ఘకాలంగా సప్న భవనాని అనే హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆయన దగ్గర పనిచేస్తోంది. కాకపోతే ఇప్పుడు ఆమె జాబ్ పోయే ప్రమాదంలో ఉందంట. అయితే దానికి కారణం ధోనీ కూతురు జీవా అంట. ఎందుకు అంటే జీవా మేకోవర్ నేర్చుకుంటుండమేనని సప్న తన ట్వీటర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. కరోనా వైరస్ పుణ్యమా అని IPL తో సహా అన్ని క్రికెట్ టోర్నీలు పూర్తిగా రద్దవడంతో ధోనీ గత కొన్నిరోజులుగా ఇంట్లోనే వారి ఫ్యామిలీతో పూర్తి సమయం గడుపుతున్నాడు. 

 

 


ఈ నేపథ్యంలోనే తాజాగా ధోనీకి హెయిర్‌ కటింగ్ చేసేందుకు సప్న అక్కడికి చేరుకోగా.. అయితే ధోని కూతురు జీవా కూడా ఆమె నుంచి మేకోవర్ టెక్నిక్స్ నేర్చుకుంటూ ధోనీపై తన ప్రయోగం చేసింది. ఈ ప్రయోగ సమయంలో వీడియో తీసిన సప్న ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ అందమైన పిల్లకి నా జాబ్ వెళ్లిపోతుందనుకుంటున్నా’’ అని అందులో రాసుకొచ్చింది పాపం ఆ స్వప్న.

మరింత సమాచారం తెలుసుకోండి: